
భారత దంపతులకు ఊరట లభించింది. మూడు నెలల తర్వాత వారు తమ పిల్లలను శుక్రవారం కలవగలిగారు. నార్వేలోనే ఉండాలనే షరతుపై అధికారులు వారి పిల్లలను వదిలేశారు. పిల్లలను తల్లి సరిగా చూడడం లేదనే ఉద్దేశంతో నిరుడు కోల్కత్తాకు చెందిన అనురూప్ భట్టాచార్య, సాగరిక పిల్లలను నార్వే అధికారులు తీసుకుని వెళ్లారు.
పిల్లలకు తమ చేతులతో తిండి తినిపిస్తున్నారని, పిల్లలు వారితోనే పడుకుంటున్నారని అభ్యంతరం చెబుతూ పిల్లలను నార్వే అధికారులు తీసుకుని వెళ్లారు. తన కుమారుడు తన తండ్రితో పడుకుంటున్నాడని, అయితే అతను విడిగా పడుకోవాలని వారు చెబుతున్నారని సాగరిక భట్టాచార్య చెప్పింది. పిల్లలకు చేతులతో తినిపించడం భారత సంప్రదాయంలో సాధారణ విషయమని, చేతులతో తినిపించడమంటే ఎక్కువ తినిపించడమని వారంటున్నారని, ఇవి సాంస్కృతిక వైరుధ్యాలని ఆమె అంటోంది.
పిల్లలకు తమ చేతులతో తిండి తినిపిస్తున్నారని, పిల్లలు వారితోనే పడుకుంటున్నారని అభ్యంతరం చెబుతూ పిల్లలను నార్వే అధికారులు తీసుకుని వెళ్లారు. తన కుమారుడు తన తండ్రితో పడుకుంటున్నాడని, అయితే అతను విడిగా పడుకోవాలని వారు చెబుతున్నారని సాగరిక భట్టాచార్య చెప్పింది. పిల్లలకు చేతులతో తినిపించడం భారత సంప్రదాయంలో సాధారణ విషయమని, చేతులతో తినిపించడమంటే ఎక్కువ తినిపించడమని వారంటున్నారని, ఇవి సాంస్కృతిక వైరుధ్యాలని ఆమె అంటోంది.













