లాస్ ఎంజెలెస్లో గణేశ్ పూజ, మినీ ఇండియా
కాలిఫోర్నియా: విదేశీ భారతీయులు తమ పండుగలు పబ్బాల ద్వారా తమ సంస్కృతిని, అస్తిత్వాన్ని చాటుటుకుంటున్నారు. భారత సంస్కృతిని పరిరక్షించడంలో భాగంగానే కాకుండా తమ ఆనందం కోసం వారు ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు.
అమెరికా లాస్ ఎంజెలెస్లోని సదర్న్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం భారత విద్యార్థుల సంఘం పరదేశంలో మినీ ఇండియాను సృష్టించారు. ఈ సంఘంలో దాదాపు 500 విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. భారతదేశం నుంచి కాలిఫోర్నియాలో ఉంటున్న విద్యార్థులు అధిక సంఖ్యలోనే ఉన్నారు.
ఇటీవల ఆగస్టు 29వ తేదీన సంఘం విశ్వవిద్యాలయంలో వినాయక పూజను నిర్వహించారు. వినాయక చవితి చేసుకుంటుంటే తమకు ఇంటి వద్ద ఉన్నట్లు అనిపించిందని సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. గణేశ్ పూజ తర్వాత విందు జరిగింది. అందరూ ఉల్లాసంగా గడిపారు.
గణేశ్ పూజ ఇచ్చిన ఆనందాన్ని మరిచిపోలేని విద్యార్థులు గార్బా డ్యాన్స్, దీపావళి ఉత్సవాలను కూడా నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. పానీపరి ఫెస్ట్, సోషల్ మిక్స్చర్ వంటి వినోదాత్మక కార్యక్రమాలను కూడా వారు నిర్వహించుకుంటున్నారు.