తెలుగు సినిమాపై తెలంగాణ పిడుగు
ఇక అక్కినేని నాగార్జున నటిస్తున్న 'రాజన్న" చిత్రం తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. అందులో నాగార్జున పాత్ర తెలంగావాది కావడం గమనించతగ్గది. అలాగే, ఆమధ్య విడుదలైన వరుణ్ సందేశ్ 'ఏమైంది ఈవేళ" చిత్రంలో హీరోను వరంగల్వాసిగా చూపించారు. అలాగే సాయికుమార్ కుమారుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన 'ప్రేమకావాలి" చిత్రంలో హీరో స్వస్థలం ఖమ్మంగా చూపించడం జరిగింది.
వీటితో పాటు మొన్న బుధవారం విడుదలైన 'అహనా పెళ్లంట" చిత్రంలోనూ హీరోయిన్ వరంగల్కు చెందిన అమ్మాయిగా చూపించారు. అంతేకాదు.. హీరోయిన్స్ సోదరులు శ్రీహరి, సుబ్బరాజు, హీరోయిన్ తండ్రి నాగినీడు తదితరులంతా తెలంగాణా మాండలికంలోనే మాట్లాడుతూ ఉంటారు.ఇలా తెలుగు సినిమాల్లో ఒక్కసారిగా తెలంగాణాకు, ప్రాంతానికి పెద్దపీట వేస్తున్నారు. అయితే అక్కడ సంస్కృతి,సంప్రదాయాలను కూడా గుర్తించి,గౌరవించి వాటిని సైతం సినిమాల్లో పెడితే మన తెలుగు సినిమాలు మరింత జీవంతో ఉట్టి పడతాయి.ఈ మార్పుకు కారణం ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా తెలంగాణా ఉద్యమమేనన్నది మాత్రం నిజం.