
ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులు ప్రదానోత్సవం ఈసారి కూడా జరిగే అవకాశం లేనట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగుదేశం పార్టీ వారు ఎక్కువగా ఉండడం వల్లనే నంది అవార్డుల ప్రదానోత్స కార్యక్రమం పట్ల కాంగ్రెసు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరాసక్తత ప్రదర్శిస్తోందనే మాట వినిపిస్తోంది. చివరిసారి నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం 2010 మార్చి 17వ తేదీన జరిగింది. అది కూడా 2008 నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం.
తెలుగుదేశం పార్టీ వారు ఎక్కువగా ఉన్నారనే దానికన్నా తెలుగు సినీ పరిశ్రమ రెండుగా విడిపోయింది. రాజకీయంగా రెండు గ్రూపులుగా విడిపోయిందనే విషయం కొత్త విషయమేమీ కాదు. ఈ రాజకీయాల వల్ల ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు సంబంధాలు పెద్దగా కొనసాగడం లేదు. 2009, 2010 నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు వాటిని ప్రదానం చేయలేదు. 2011 అవార్డులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రాజకీయ కారణాల వల్లనే నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగడం లేదని అంటున్నారు.
నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయం ఇస్తే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, తగిన సమయంలో ఆ కార్యక్రమం ఉంటుందని సంస్థ అధికారులు అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ వారు ఎక్కువగా ఉన్నారనే దానికన్నా తెలుగు సినీ పరిశ్రమ రెండుగా విడిపోయింది. రాజకీయంగా రెండు గ్రూపులుగా విడిపోయిందనే విషయం కొత్త విషయమేమీ కాదు. ఈ రాజకీయాల వల్ల ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు సంబంధాలు పెద్దగా కొనసాగడం లేదు. 2009, 2010 నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు వాటిని ప్రదానం చేయలేదు. 2011 అవార్డులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రాజకీయ కారణాల వల్లనే నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగడం లేదని అంటున్నారు.
నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయం ఇస్తే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, తగిన సమయంలో ఆ కార్యక్రమం ఉంటుందని సంస్థ అధికారులు అంటున్నారు.













