మిసెస్ అయ్యారా?: అంజలి ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్
అంజలికి పెళ్లైందని కళంజియం చెప్పడంతో ఆమె అదృశ్యం వెనుక తన పిన్ని భారతి దేవి వేధింపులు వట్టిమాటేనా? అనే చర్చ ప్రారంభమైంది. తన పిన్ని, బాబాయిల వేధింపులు తట్టుకోలేక తాను అదృశ్యమయ్యానని అంజలి చెప్పిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల తర్వాత ఆమె పోలీసులు ఎదుట ఓ నిర్మాతతో కలిసి హాజరయ్యారు.
ఇప్పుడు కళంజియం అంజలికి పెళ్లైనందువల్లే అదృశ్యమంటూ చెప్పారట. ఆమె ఓ స్టార్ ప్రొడ్యూసర్ను పెళ్లి చేసుకున్నారని చెప్పారని అంటున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ను పెళ్లి చేసుకునేందుకే ఆమె నాలుగు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిందనే గుసగుసలు పరిశ్రమలో వినిపిస్తున్నాయట.
అయితే, అంజలి నిజంగానే మిసెస్ అయిందా? లేక ఆరోపణలు మాత్రమేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంజలి అదృశ్యమైనప్పుడు పిన్ని భారతి, బాబాయ్లతో పాటు దర్శకుడు కళంజియం పైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంజలి అజ్ఞాతం వీడినా వివరాలు పూర్తిగా చెప్పక పోవడంతో చర్చనీయాంశమైంది.