బాబు పూజలు, నమాజు చేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన పర్యటన విజయం సాధించిందనే చెప్పాలి.
చంద్రబాబు రెండోరోజు పర్యటన కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో కొనసాగించారు. అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో శుక్రవారం సమావేశమైన ముఖ్యమంత్రి ఆ తరువాత ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఒంటి గంటకు కుటాగుల్ల పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడిబయటి పిల్లలకు ఆయనే స్వయంగా అడ్మిషన్ ఇచ్చారు.
చేనేతల రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ధర్మవరం నే తన్నలు ఘనంగా సన్మానించారు. శాలువతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన మగ్గం న మూనాను బహూకరించారు. చిన్నాభిన్నమైన చేనేత పరిశ్రమను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ధర్మవరం చేనేత నా యకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు.
కదిరి మసీదులో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారంనాడు కదిరి మసీదులో జరిగిన ముస్లిం ప్రార్థనల్లో పాల్గొన్నారు.
మసీదులో ఇలా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారంనాడు కదిరి మసీదులో ప్రార్థనల సందర్భంగా ఇలా కనిపించారు.
చంద్రబాబుకు సన్మానం
కదిరిలో ముస్లిం మైనారిటీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సత్కరించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఆలయంలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కదిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వచ్చారు.
ఆలయంలో పూజలు
కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దైవదర్శనం చేసుకున్నారు.
ఆలంయలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామి దర్శనం చేసుకున్న తర్వాతా ఆయనకు వేదపండితులు ప్రసాదం ఇచ్చారు.
చంద్రబాబుకు వినతులు
అనంతపురం జిల్లాలో చంద్రబాబుకు వివిధ వర్గాలకు చెందినవారు వినతిపత్రాలు సమర్పించారు. ఓ మహిళ తన చిన్నారితో చంద్రబాబుతో ఇలా కనిపించారు.
మంత్రి గంటా ఇలా..
ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు కదిరి లక్ష్మీ నర్సింహస్వామి దర్శనం చేసుకున్నారు.