బస్సెక్కి రూ12తో టెక్కీ నందన్ నీలేకని టిక్కెట్(పిక్చర్స్)
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు దక్షిణ నుండి కాంగ్రెసు పార్టీ తరఫున లోకసభకు పోటీ చేస్తున్న టెక్కీ నందన్ నీలేకని జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ఆయన శుక్రవారం ఓ బస్సులో ప్రయాణం చేసి ప్రచారం చేశారు. నందన్.. బిఎంటిసికి చెందిన 2ఏ నెంబర్ గల బస్సును జయనగర్ బస్సు స్టాప్ వద్ద ఎక్కారు.
జెపి నగర్ ఇందిరా గాంధీ సర్కిల్ వద్ద దిగారు. బస్సులో ప్రయాణించిన ఈ టెక్కీ రూ.12 చెల్లించి టిక్కెట్ తీసుకున్నారు. బస్సులో ఆయన పలువురితో ముచ్చటించారు.
నందన్ నీలేకని
కర్నాటక రాజధాని బెంగళూరు దక్షిణ నుండి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన పోటీ చేస్తున్న నందన్ నీలేకని తన ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థి అనంత్ కుమార్ పైన మండిపడ్డారు. నందన్ కాంగ్రెసు పార్టీ బరువును మోస్తున్నారని అనంతం వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దానికి నందన్ కౌంటర్ ఇచ్చారు. అనంత్ కుమార్కు తన సొంత బరువునే మోయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
నందన్ నీలేకని
మన బస్సు మరియు మెట్రో సిస్టమ్ బెంగళూరు ప్రజానీకానికి అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నానని నందన్ నీలేకని ఈ సందర్భంగా చెప్పారు.
నందన్ నీలేకని
బిఎంటిసి(బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్) బాగా పని చేస్తోందని నందన్ కితాబిచ్చారు. రవాణా వ్యవస్థ పైన తాను బెంగళూరు ప్రజలను సలహాలు అడిగితే ఎందరో మంచి మంచి సూచనలు చేశారన్నారు. వారి సలహాలు, సూచనల ద్వారా వరల్డ్ క్లాస్ బస్ అండ్ మెట్రో సిస్టంగా మార్చవచ్చునన్నారు.
నందన్ నీలేకని
కర్నాటక రాజధాని బెంగళూరు దక్షిణ నుండి కాంగ్రెసు పార్టీ తరఫున లోకసభకు పోటీ చేస్తున్న టెక్కీ నందన్ నీలేకని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన శుక్రవారం ఓ బస్సులో ప్రయాణం చేసి ప్రచారం చేశారు. నందన్.. బిఎంటిసికి చెందిన 2ఏ నెంబర్ గల బస్సును జయనగర్ బస్సు స్టాప్ వద్ద ఎక్కారు.
నందన్ నీలేకని
జెపి నగర్ ఇందిరా గాంధీ సర్కిల్ వద్ద దిగారు. బస్సులో ప్రయాణించిన ఈ టెక్కీ రూ.12 చెల్లించి టిక్కెట్ తీసుకున్నారు. బస్సులో ఆయన పలువురితో ముచ్చటించారు.