ముస్లిం మతోన్మాదులుగా మారాలి: ఇల్మి సంచలనం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత షాజియా ఇల్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా పలువురు నాయకులు విద్వేష ప్రసంగాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా షాజియా ఇల్మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ముస్లింలు లౌకికవాదులుగా ఉన్నారని, వారు తొలిసారిగా మతోన్మాదులుగా మారి తమ వారికి ఓటేయాల్సిన అసవరం ఉందని ఆమె అన్నారు. ఈ మేరకు ఇటీవల ముంబైలో తనను కలసిన ముస్లింలకు ఇల్మి చేసిన సూచనలకు సంబంధించిన 79 సెకండ్ల నిడివిగల వీడియో వెలుగు చూసింది.
ఇది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఎఎపి మాత్రం మాత్రం ఇలాంటి వ్యాఖ్యలకు తమ పార్టీలో చోటు లేదని తెలిపింది. వీటిని తాము ఆమోదించమంది. ఇల్మి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు.
కాగా, బిజెపి నేత గిరిరాజ్ సింగ్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని సమర్ధించని వాళ్లంతా పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ గిరిరాజ్ చేసిన వ్యాఖ్యలపై ఈసి అభ్యంతరం తెలిపింది. ఇప్పటికే గిరిరాజ్పై ఈసి ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆదేశాలు జారీ చేసింది. బీహార్, జార్ఖండ్లలో గిరిరాజ్ ప్రవేశంపై ఈసి నిషేధం విధించింది.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/RVVpkp0I7xE?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>