Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుష్క- కోహ్లీ వివాదం...షాహిద్ కపూర్ కామెంట్
హైదరాబాద్: ఆ మధ్య ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లీకి తోడుగా అనుష్క శర్మ కూడా వెళ్ళడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఫెయిల్యూర్కు విరాట్ కోహ్లి-అనుష్క శర్మ ప్రేమ వ్యవహారాన్ని పావుగా వాడుకుంది బిసీసీఐ అనే విమర్శలకు వచ్చాయి. ఈ వ్యవహారం కాస్తా గర్ల్ ఫ్రెండ్స్, భార్యలు వెంట రావడం వల్లనే టీం ఫెయిల్యూర్ అయిందనే వాదనకు దారి తీసింది.
ఈ మొత్తం వ్యవహారంలో అనుష్క శర్మ, కోహ్లిలను బ్లేమ్ అయ్యారు. త్వరలో వారు పెళ్లి చేసుకుంటారని చెప్పడం వల్లనే వారిని అనుమతించామని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటగాళ్లతో గర్ల్ ప్రెండ్స్ను అనుమతించబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఇలా చేయడం ద్వారా టీం ఫెయిల్యూర్ వెనక ఏదో కొత్త కారణాన్ని చూపే ప్రయత్నం చేసింది బీసీసీఐ.
అయితే బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్....బీసీసీఐ వ్యవహారాన్ని తప్పుబట్టాడు. ఎవరు ఎవరినైనా కలిసే హక్కు ఉంటుంది. బీసీసీఐ వ్యవహారాన్ని తాను అస్సలు సపోర్టు చేయను. కోహ్లి, అనుష్క విషయంలో బీసీసీఐ అనవసర రాద్దాంతం చేస్తోంది. అయితే గర్ల్ ఫ్రెండ్స్, వైఫ్స్ వెంట రావడం వల్ల ప్లేయర్స్ ఫెయిల్ అవుతున్నారనడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించాడు షాహిద్.
ఎవరి పర్సనల్ లైఫ్ వారికి ఉంటుంది....బీసీసీఐ క్రికెటర్ల పర్సనల్ లైఫ్ గురించి నానా యాగీ చేయడం సరైంది కాదు. ఈ విషయంలో తన పూర్తి మద్దతు కోహ్లి, అనుష్కలకే ఉంటుందని షాహిద్ వ్యాఖ్యానించారు.