ఇంచియాన్: త్వరలో జరగనున్న ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్ విభాగం(గుర్రపు పందేలు)లో నిర్వహించే పోటీల్లో ఓ అందాల యువరాణి పాల్గొనబోతోంది. ఆమే థాయ్లాండ్ దేశానికి చెందిన యువరాణి సిరివన్నవారి నారిరతన. ఈమె థాయ్లాండ్ రాజవంశానికి చెందిన కింగ్ భుమిబోల్కు అదుల్యదేజ్కు మనుమరాలు.
27ఏళ్ల నారిరతన ఆసియా క్రీడల్లో పాల్గొనడమిది తొలిసారి కాదు. 2006 దోహా క్రీడల్లో ఆమె బ్యాడ్మింటన్లో పోటీ పడింది. అప్పట్లో తోటి అథ్లెట్లతో కలిసి అథ్లెటిక్ష్ విలేజ్లో బస చేసిన ఆమె అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
చిన్ననాటి నుంచి నుంచి గుర్రపు స్వారీలో అనుభవమున్న నారిరతన.. రెండు మూడేళ్ల నుంచి పోటీల్లో పాల్గొంటోంది. అంతేగాక ఎవరి సిఫార్సు లేకుండా తన సొంత ప్రతిభతోనే ఆసియా క్రీడల జట్టులో ఆమె స్థానం సంపాదించుకుంది.
తన లక్ష్యం స్వర్ణం సాధించడమేనని నారిరతన చెబుతోంది. ఆసియా క్రీడల్లో ఆమె గుర్రపు స్వారీ చూడాలంటే కొన్ని రోజులపాటు ఆగాల్సిందే. ప్రస్తుతం ఆమె ఫైన్ ఆర్ట్స్ చదువుకుంటూ.. ప్యారిస్లో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తోంది.