కేసీఆర్పై పొన్నాల ఫైర్, కార్తీక నోట్లో పెట్టారు (పిక్చర్స్)
హైదరాబాద్: తెరాస ప్రభుత్వం.. ప్రతి ప్రాజెక్టునూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామని చెబుతోందని, కానీ చేతలు మాత్రం అథమ స్థాయిలో ఉన్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క ప్రజా సంబంధ కార్యక్రమాన్ని అమలు చేయలేదని పొన్నాల విమర్శించారు.
ఎన్నికల సందర్భంలో 60 రకాల హామీలు ఇచ్చారని, ఒక్కదానిని అమలు చేయలేదన్నారు. ఆర్థిక భారం పడే అంశాలను పక్కన పెట్టి, కేవలం సెంటిమెంటుతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని తెరాస ప్రభుత్వం చూస్తోందన్నారు. కాగా, రంజాన్ సందర్భంగా టీ కాంగ్రెస్ ఇఫ్తార్ విందు ఇచ్చింది.
విందు
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ తెలంగాణ సీనియర్ నేత జైపాల్ రెడ్డికి తినిపిస్తున్న మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ.
విందు
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ తెలంగాణ సీనియర్ నేత జైపాల్ రెడ్డికి తినిపిస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
విందు
మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీకి తినిపిస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దృశ్యం.
విందు
తెలంగాణ కాంగ్రెసు పార్టీ భవనమైన గాంధీ భవనంలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైన పార్టీ నేతలు పొన్నం ప్రభాకర్ తదితరుల దృశ్యం.
విందు
విందులో పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, జైపాల్ రెడ్డి, ఎంఏ ఖాన్, నంది ఎల్లయ్య, మేయర్ మాజీద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
విందు
మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీకి తినిపిస్తున్న మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ తెలంగాణ సీనియర్ నేత జైపాల్ రెడ్డి.
విందు
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ తెలంగాణ సీనియర్ నేత జైపాల్ రెడ్డికి తినిపిస్తున్న మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ.
విందు
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ నగర సీనియర్ నాయకుడు దానం నాగేందర్కు తినిపిస్తున్న దృశ్యం. గాంధీ భవన్లో ఇఫ్తార్ విందు ఇచ్చారు.
విందు
మాజీ మేయర్ బండారు కార్తీక రెడ్డి శనివారం జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు తినిపిస్తున్న దృశ్యం.