మహిళ లోదుస్తుల్లో బంగారం: ఏడుగురి పట్టివేత
చెన్నై విమానం నుంచి దిగిన రాణి (43)ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె లోదుస్తుల్లో 14 బంగారు బిస్కెట్లు దొరికాయని అదఇకారులు చెప్పారు ఒక్కొక్క బంగారం బిస్కెట్ బురువు వంద గ్రాములు ఉంటుందని వారు చెప్పారు.
అదే విధంగా, సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో చెన్నై వచ్చిన శ్రీలంకకు చెందిన వడివళగిరి (48), పింగారా (40), శివగంగైకి చెందిన మరియమ్మాళ్ (50), జీనత్ (38)లను కూడా కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ నలుగురు మహిళలు 1550 గ్రాముల బంగారం బిస్కెట్లతో పట్టుబడ్డారు.
సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన చెన్నైకి చెందిన కనియమ్మాళ్ (39) తన సెల్ఫోన్ బ్యాటరీ స్థానంలో బంగారం బిస్కెట్ను ఇంచి తెస్తుండగా దాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో బేగం అనే మహిళను కూడా పట్టుకున్నారు. ఈ ఏడుగురు మహిళల నుంచి ఒకే రోజు కోటి రూపాయల విలువైన 3.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు. పట్టుబడిన మహిళలు స్మగ్లింగ్ ముఠాకు చెందినవారని అనుమానిస్తున్నారు.