వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగం పేరుతో.. బలవంతంగా తాగించి, ఆరుగురు రేప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం జరిగింది. 19 ఏళ్ల నేపాల్ యువతి పైన ఆరుగురు వ్యక్తులు ఆత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు చెందిన ఓ యువతిని ఆరుగురు ఢిల్లీలోని మెహరౌలీ ప్రాంతంలో అత్యాచారం చేశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిందితుల్లో ఒకతను బాధిత యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తీసుకు వెళ్లాడు. అక్కడకు చేరుకోగానే మరో ఐదుగురు యువకులు ఉన్నారు. వారందరు కూడా తాగిన మత్తులో ఉన్నారు. తాగి ఉన్న వారు ఆమెను వేధించారు. అంతేకాదు, మందు తాగమని బలవంతం చేశారు.

Six men gang-rape Nepali girl in Delhi

వైద్య పరీక్షల్లో.. యువతికి బలవంతంగా మద్యం తాగించినట్లు, సామూహిక అత్యాచారానికి గురైనట్లుగా తేలినట్లు తెలుస్తోంది. కాగా, 2013లో ఢిల్లీలో నేరాలు గత ఏడాది కంటే ఎక్కువైనట్లుగా రికార్డులు చెబుతున్నాయి. 2012లో 706 రేప్ కేసులు ఉంటే, 2013లో 1636 కేసులు నమోదయ్యాయి.

English summary
At a time when the national capital is struggling hard to get rid of the rape capital tag, yet another incident of sexual assault on a 19-year-old girl has come to the fore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X