వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ జైలులో తెలుగు ఖైదీ: వివరాలిస్తే విడుదల
భారత్కు చెందిన తెలుగు ఖైదీ విడుదలకు పాకిస్థాన్ అధికారులు సిద్ధమయ్యారు. అయితే అతడికి సంబంధించిన పూర్తి వివరాలేవీ లేకపోవడంతో అక్కడి అధికారులు భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఖైదీకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం కోరింది.
సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రవీందర్ రెడ్డి బుధవారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఖైదీ పేరు రమేష్ అని, అతనికి 20ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలని, కుడి చెంపపై పెద్ద పుట్టుమచ్చ ఉందని పేర్కొన్నారు.
ఈ వివరాలతో పోలికలున్న వ్యక్తి కుటుంబం తమని సంప్రదిస్తే పాస్పోర్ట్ సిద్ధం చేసి పాకిస్థాన్కు పంపిస్తామని ఆయన తెలిపారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తే ఖైదీగా ఉన్న రమేష్ను పాకిస్తాన్ విడుదల చేస్తారు.
telugu youth pakistan jail telangana andhra pradesh తెలుగు యువకుడు పాకిస్థాన్ జైలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్
English summary
It said that a Telugu youth held in Pakistan jail.
Story first published: Thursday, August 28, 2014, 8:58 [IST]